Sigachi industry: రియాక్టర్ పేలిన ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో చికిత్స పొందుతున్న భీమ్ రావు(Bhim Rao) అనే కార్మికుడు ఈరోజు ఉదయం మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.

7 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక

కాగా ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇప్పటికే ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ(High level committee) దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించనుంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి, 7 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక(Preliminary report)ను సమర్పించనుంది.

ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తింపు

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మృతదేహాలను గుర్తించామని, మరో 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య(Collector P. Praveenya) తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి 20 అస్థిపంజర భాగాలను వెలికితీసి, DNA గుర్తింపు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఇప్పటికే 95% DNA నమూనాల సేకరణ పూర్తయిందని SP పరితోశ్‌ పంకజ్ చెప్పారు. ఇదిలా ఉండగా, గాయపడిన 33 మందిలో 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, వారికి తక్షణ సాయంగా రూ. 1 లక్ష చొప్పున అందించామని సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

Culpable homicide, voluntary hurt charges against Sigachi Industries after  safety violations revealed at chemical unit causing Telangana factory blast  - Telangana News | India Today

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *