IPL 2025: లక్నోపై ఢిల్లీ విజయం.. నేడు ముంబైతో సన్‌రైజర్స్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axer Patel) తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.


రాహుల్ ప్రతీకార ఇన్నింగ్స్..

ఓపెనర్ కరుణ్ నాయర్ (15) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ బ్యాటర్ KL రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పోరెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. లక్నో బౌలర్లలో ఐడెన్ మార్క్రమ్(Markram) 2 వికెట్లు పడగొట్టాడు.

బ్యాటింగ్‌లో ఆ ముగ్గురే..

అంతకుముందు లక్నో బ్యాటర్లలో మార్క్రమ్ 52, మార్ష్ 45, బదోని 36 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో LSG నిర్ణీత 20 ఓవర్లలో 159/6 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్(Mukesh Kumar) 4 వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, చమీరా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో డీసీ పాయింట్ల పట్టికలో 2వ స్థానాన్ని పటిష్ఠం చేసుకోగా.. లక్నో జట్టు 5వ ప్లేస్‌కు పడిపోయింది. కాగా ఇవాళ హైదరాబాద్ వేదికగా SRH vs MI జట్లు తలపడనున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *