Dhanush-Aishwarya: వాటే పేరెంట్స్.. కొడుకు కోసం ఒక్కటయ్యారు!

తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో నటన, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌(Fan Base)ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కూతురు ఐశ్వర్య(Aishwarya)ని పెళ్లాడాడు. వీరికి యాత్ర రాజా, లింగా అనే ఇద్దరు కొడుకులున్నారు. అయితే అనూహ్యంగా మనస్పర్ధలతో ఈ జంట దాదాపు 20 ఏళ్ల తర్వాత విడిపోయింది. ప్రస్తుతం వీరు విడివిడిగానే ఉంటున్నారు. అయితే విడుకుల(Divorce) తర్వాత ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఆ మధ్య తరచూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ధనుష్ మళ్లీ ఐశ్వర్యతో కలిసి కనబడడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ వీరిద్దరూ మళ్లీ ఎందుకు కలిశారో తెలుసుకుందామా..

మనవడికి రజినీకాంత్ శుభాకాంక్షలు

హీరో ధనుష్ -ఐశ్వర్య కుమారుడు యాత్ర రాజా(Yathra Raja) తాజాగా స్కూల్ గ్రాడ్యుయేషన్(School Graduation) పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య అలాగే హీరో ధనుష్ ఇద్దరు కలిసి పాల్గొన్నారు.ఈ తరుణంలో తమ కొడుకును ఇద్దరు హగ్ చేసుకుని మరి ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫోటోను సూపర్ రజినీకాంత్ షేర్ చేశారు. తన మనవడికి రజినీకాంత్ శుభాకాంక్షలు(Congrats) చెప్పారు. నా ముద్దుల మనవడా మొదటి మైలురాయి దాటేశావ్… యాత్ర కన్నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. కాగా ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కో పేరెంటింగ్(Co-Parenting) చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొడుకు కోసం ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం. ఏది ఏమైనా కొడుకు కోసం ఇద్దరూ ఇలా కనిపించడం చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు.

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *