తెలుగు సినిమా ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్ 2025 సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విభిన్న జానర్లలో, స్టార్ హీరోలతో కూడిన భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాభవుతున్నాయి. సెప్టెంబర్ 5న క్రిష్(Krish) దర్శకత్వంలో అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి(Ghaati)’ విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్, డ్రామాతో పాటు అనుష్క శక్తిమంతమైన నటనతో ఆకట్టుకోనుంది. అదే రోజు మురుగదాస్-శివకార్తికేయన్ కాంబోలో ‘మదరాసి(Madharasi)’ కూడా రిలీజ్ అవుతోంది. ఇది కామెడీ, యాక్షన్ మిశ్రమంతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘కిష్కింధపురి(Kishkindhapuri)’ థియేటర్లలోకి రానుంది. ఇది హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంగా హైప్ సృష్టిస్తోంది.

సెప్టెంబర్ 25న పవన్ అభిమానులకు ట్రీట్
ఇక అదే రోజు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత(Kanta)’ కూడా విడుదలవుతుంది. ఇది భావోద్వేగ నాటకీయతతో ప్రేక్షకుల హృదయాలను గెలవనుంది. తేజా సజ్జ నటించిన ‘మిరాయ్(Mirai)’ సెప్టెంబర్ 12 లేదా 19న రిలీజ్ కానుందని సమాచారం, ఈ సినిమా సైన్స్-ఫిక్షన్ జానర్తో ఆసక్తి రేకెత్తిస్తోంది. నెలాఖరులో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘OG’ మంచి ట్రీట్ ఇవ్వనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2(Akhanda-2) కూడా సెప్టెంబర్ 25నే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రవితేజ ‘మాస్ జాతర(Mass Jathara)’ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడం ఖాయం.

భిన్నమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధం
వీటితో పాటు, విజయ్ ఆంటోనీ నటించిన ‘భద్రకాళి(Bhadrakali)’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్, డ్రామాతో కూడిన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించనుంది. అలాగే, సుందరకాండ, కన్యాకుమారి, ఛాంపియన్ వంటి చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు కొత్త కథలు, నటులతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో కొత్త సినిమాల సందడిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







