Sunul Gavaskar: రిలాక్స్​ కావద్దు.. ప్రాక్టీస్​ చేయండి

అడిలైడ్‌ టెస్టులో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శన తర్వాత భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunul Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు వైఖరి, సన్నద్ధతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పింక్​ బాల్ టెస్టు కోసం భారత ఆటగాళ్ల సన్నద్దత సరిపోలేదని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు కోసం కీలక సూచనలు చేశాడు.

ప్రాక్టీస్​ కోసం సద్వినియోగం చేసుకోవాలి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (border gavaskar trophy) చూసే దృక్పథాన్ని మార్చుకోవాలని, ఆడిలైడ్ టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. హోటల్​ రూమ్స్​లో కూర్చోకుండా మైదానంలోకి దిగాలన్నాడు.

చెమట చిందించండి
‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గానే భావించండి. ఇది ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనే విషయాన్ని మర్చిపోండి. రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో మిగిలిన రెండు రోజుల సమయాన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. భారత జట్టుకు ఇది చాలా కీలకమైన సమయం. మీరు ఇక్కడకు క్రికెట్ ఆడేందుకే వచ్చారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని.. హోటల్ రూమ్స్‌లో కూర్చోకుండా.. మైదానంలోకి దిగండి. ప్రాక్టీస్ చేయండి. చెమట చిందించండి’ అని గవాస్కర్ సూచించాడు. రోజంతా ప్రాక్టీస్​ చేయాల్సిన పనిలేదని, ఉదయం లేదా మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో సెషన్ పాటు ప్రాక్టీస్ చేయాలని కోరాడు.

మొదట గెలుపు.. ఆ తర్వాత ఓటమి
బోర్డర్​ గవాస్కర్​ సిరీస్​లో భాగంగా (Ind vs Aus) పెర్త్​లో జరిగిన మొదటి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో () 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో టీమిండియా పుంజుకొని సిరీస్​లో ఆధిక్యం సాధించాలని భారత ప్రేక్షకులు కోరుతున్నారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *