వరుసగా మూడో రోజూ భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది?

Mana Enadu :  ఆంధ్రప్రదేశ్​లో భూప్రకంపనలు (Earthquake) మరోసారి కలకలం రేపుతున్నాయి.  ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అసలేం జరుగుతోంది?

గత రెండ్రోజులుగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. వరుసగా మూడో రోజు ఇవాళ ప్రకంపనలు రావడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని అయోమయానికి గురవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు

ఇటీవల 4వ తేదీన  తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు (Telangana Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైనట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ..  తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పరిధిలో భూమి కంపించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *