ఫార్ములా ఈ-రేసు కేసులో బిగ్ ట్విస్టు.. రంగంలోకి ఈడీ

Mana Enadu :  హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసు (Hyderabad Formula E Race Case)లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రిపై ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తాజాగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు కోసం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ED Enters Formula E Race Case) అధికారులు రంగంలోకి దిగారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

హైకోర్టుకు కేటీఆర్..

ఇక అంతకుముందు ఈ వ్యవహారంలో ఏసీబీ (KTR ACB Case) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని సింగిల్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అయితే ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్.. కోర్టుకు తెలపగా.. కేటీఆర్ తరఫు లాయర్.. చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు అందడంతో.. మధ్యాహ్నం 2.15 కు హైకోర్టు (KTR Petition in High Court) చీఫ్ జస్టిస్ బెంచ్‌పై లంచ్ మోషన్ పిటిషన్‌ విచారణకు రానుంది.

అసలు ఈ కేసు ఏంటంటే..?

ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు భారీ నగదు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ (Dana Kishore) ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయన్ను ఏ1గా, సీనియర్ ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌ (IAS Arvind Kumar) ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ BLN రెడ్డి ఏ3గా చేర్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *