Anil Ambani: మనీలాండరింగ్ ఆరోపణలు.. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు(Summons) జారీ చేసింది. రూ.17,000 కోట్ల విలువైన రుణ మోసం(Loan Fraud) కేసులో ఆయనను ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు మనీలాండరింగ్ ఆరోపణల(Money laundering allegations)తో ముడిపడి ఉంది. ప్రధానంగా 2017-2019 మధ్య YES బ్యాంక్ నుంచి అంబానీ గ్రూప్ కంపెనీలకు రూ.3,000 కోట్ల రుణాలు మంజూరైన తీరును ఈడీ పరిశీలిస్తోంది. ఈ రుణాలు అక్రమంగా మళ్లించబడ్డాయని, షెల్ కంపెనీల(Shell companies)కు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.

మొత్తం 85 చోట్ల సోదాలు

కాగా జులై 24 నుంచి మూడు రోజులపాటు ఈడీ ముంబై, ఢిల్లీలో 35 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 50 కంపెనీలు, 25 వ్యక్తులతో సహా అంబానీ గ్రూప్‌(Ambani Group)కు చెందిన కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుంది. యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు రుణాల మంజూరీకి ముందు లంచం రూపంలో చెల్లింపులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. సెబీ(SEBI), నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలు, CBI ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది.

ED raids on Anil Ambani group of companies continue on day 3; Reliance  Infra and Power deny business link to RCom - Industry News | The Financial  Express

ఈ కంపెనీల లావాదేవీలపై ఈడీ ఫోకస్

రిలయన్స్ పవర్(Reliance Power), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Reliance Infrastructure) కంపెనీలు ఈ సోదాలు తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని, అంబానీ ఈ కంపెనీల బోర్డులో లేరని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపాయి. అయితే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో గత లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అంబానీ, ఆర్‌కామ్‌ను ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *