
టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ట్రంప్కు షాకిచ్చారు. తాను డోజ్ (Department of Government Efficiency) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. ఇక మీదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం(US Govt)లో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగి(Special Government Employee)గా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ చెప్పారు. తాను లేకపోయినా DOGE భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశమిచ్చిన అధ్యక్షుడు ట్రంప్(Trump)కు ఎలాన్ మస్క్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
నేను వచ్చిన పని అయిపోయింది: మస్క్
కాగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించామని, తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెప్పారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటు(Annual federal deficit)ను సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు నాలుగు బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేసిందని మస్క్ చెప్పుకొచ్చారు. DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకమని చెప్పారు. అందుకే DOGEను వదిలేశానని అన్నారు.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025