Lord’s Test: లార్డ్స్‌ టెస్టులో భారత్‌కు తప్పని నిరాశ.. 22 రన్స్ తేడాతో ఓటమి

లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) మైదానంలో జరిగిన మూడో టెస్టు(Third Test) మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో టీమ్ఇండియా(Team India) 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి పోరాటం సాగించినప్పటికీ, ఇతర బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోవడంతో జట్టు ఓటమిని తప్పించలేకపోయింది.

Image

చివరి రోజు భారత్ 58/4తో ఆరంభించినప్పటికీ, రాహుల్ (33), పంత్‌(9)లు త్వరగా ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. జడేజా, జస్ప్రీత్ బుమ్రా (9), మహ్మద్ సిరాజ్ (4) గట్టి పోరాటం చేసినప్పటికీ, షోయబ్ బషీర్ తుది వికెట్ తీసి ఇంగ్లండ్‌(England)కు అపురూప విజయాన్ని అందించాడు. బెన్ స్టోక్స్ (77 పరుగులు, 5 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Image

ఈ 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్

కాగా అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్లూ 387 పరుగులు చేసి సమం చేశాయి. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), రిషభ్ పంత్ (74), జడేజా (72) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(Jofra Archar), బెన్ స్టోక్స్‌(Ben Stokes)లు రెండేసి వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులు చేసి ఆలౌట్ కాగా, వాషింగ్టన్ సుందర్ (4/22) భారత బౌలర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఓటమితో భారత్ సిరీస్‌లో వెనుకబడినప్పటికీ, జడేజా(Jadeja) ఫామ్, బౌలర్ల ప్రదర్శన సానుకూలాంశాలుగా నిలిచాయి. నాలుగో టెస్టు జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *