ఖమ్మం మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. 400 పత్తిబస్తాలు దగ్ధం

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి మార్కెట్ లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మార్కెట్ యార్డు షెడ్డులో పత్తి బస్తాలు తగులబడుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక బృందాలతో ఘటనాస్థలికి చేరుకున్నాయి.

400 పత్తి బస్తాలు దగ్ధం

విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక దళాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కాంటాకు తెచ్చిన పత్తి బస్తాలు (Cotton Crop) దగ్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *