Fire Accidents: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒక్కరోజే రెండు అగ్నిప్రమాదాలు

హైదరాబాద్‌(Hyderabad)లో ఇవాళ (మే 18) తీవ్ర విషాదం నెలకొంది. మహానగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు(Fire Accidents) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్‌(Gulzar House)లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అటు మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally)లో జరిగిన మరో ఫైర్ యాక్సిడెంట్‌లో దాదాపు 53 మందిని ఫైర్ సిబ్బంది(Fire Fighters) సురక్షితంగా రక్షించారు. ఈ రెండు ఘటనలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తప్పిన పెను ముప్పు..

నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక మూడంతస్తుల భవనం(G+3 floor + Pent house)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో భవనంలో సుమారు 53 మంది నివసిస్తున్నారు. భవనం నుంచి కిందకు దిగే ప్రధాన మెట్ల మార్గం(Main Root) వద్దే మంటలు భారీగా ఎగిసిపడటం(Fire Breaks)తో వారంతా పైఅంతస్తుల్లో చిక్కుకుపోయారు. ప్రాణభయంతో టెర్రస్‌పైకి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల(Fire Engines)తో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, లాడర్ల సహాయంతో టెర్రస్‌పై ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు.

ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతోనే..

అటు రెండో అంతస్తులో చిక్కుకున్న మరికొందరిని మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, భవనంలో చిక్కుకున్న మొత్తం 53 మందిని ప్రాణాలతో కాపాడారు. వీరిలో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *