Fire Accident: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌(Gulzar House)లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) 10 ఫైర్ ఇంజిన్లతో తక్షణమే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో 16 మరణించగా మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే..

ఈ ఘటనలో అగ్నికీలలతోపాటు దట్టంగా పొగ కమ్మేయడంతో 20 మంది వరకూ స్పృహ కోల్పోయారు. కాగా క్షతగాత్రులను ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతానికి మృతులు రాజేంద్రకుమార్‌ (67), అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), అర్షాదీ గుప్తా (7), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2)గా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

సీఎం రేవంత్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అటు ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *