AA22xA6: ఏంటి భయ్యా.. అల్లు అర్జున్ సినిమాలో ఐదుగురు హీరోయిన్లా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ‘AA22xA6’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణంలో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.

రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో..

సినీవర్గాల్లో వస్తున్న వార్తల మేరకు.. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), రష్మిక మందన్న(Rashmika Mandanna), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఐదుగురు హీరోయిన్ల ఎంపికతో సినిమా గ్లామర్, ఎమోషనల్ డెప్త్‌ను మరింత పెంచాలని అట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు హీరోయిన్లు.. సెకండ్ హాఫ్‌లో పరిచయం అవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం 800 కోట్ల భారీ బడ్జెట్‌(Big budget)తో రూపొందుతుండటం విశేషం.

Are These Five Heroines Locked for AA22 x A6? | Are These Five Heroines Locked for AA22 x A6?

టైమ్ ట్రావెల్ ఆధారంగా..

కాగా ‘Pushpa 2’తో రూ.1850+ కోట్ల కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్, అట్లీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్(Jawan)’తో రూ.1000 కోట్లు రాబట్టిన సత్తాతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా, ఈ సినిమా టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *