India-W vs England-W: గెలిస్తే రికార్డే.. నేడు ఇంగ్లండ్-ఇండియా ఉమెన్స్ మధ్య నాలుగో టీ20

ఇంగ్లండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్(India-W vs England-W) మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్‌(Manchester)లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునే కీలక అవకాశం భారత్ ముందుంది. మొదటి T20లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బ్రిస్టల్‌(Bristol)లో 24 పరుగుల తేడాతో గెలిచింది. స్మృతి మంధాన (112) మొదటి మ్యాచ్‌లో సెంచరీతో మెరిస్తే, జెమిమా రోడ్రిగ్స్ (63), అమంజోత్ కౌర్ (63*) రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలింగ్‌లో శ్రీ చరణి 6 వికెట్‌లతో సత్తా చాటింది.

England women vs India women

బౌలింగ్‌లో పటిష్ఠంగా ఇంగ్లండ్

అయితే, ఓవల్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్(England) 5 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచింది. సోఫియా డంక్లీ (75), డానీ వైట్-హాడ్జ్ (66) ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాణించగా, లారెన్ బెల్ (3/27) బౌలింగ్‌లో మెరిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం కాపాడాలని భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టులో నాట్ సివర్-బ్రంట్(Nat Siever-Brunt) గాయం నుంచి కోలుకోలేని పరిస్థితిలో టామీ బ్యూమాంట్ నాయకత్వం వహిస్తోంది. సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫిలర్‌లతో ఇంగ్లండ్ బౌలింగ్‌ పటిష్ఠంగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ తొలిసారి ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ను దక్కించుకోనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *