బంగారం కొంటున్నారా..? ఇవాళ్టి ధరలు ఇవే

బంగారం (Gold) అంటే మగువలకు కాస్త మక్కువ ఎక్కువే. అందుకే శుభకార్యాలకు తప్పకుండా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక వారు కూడబెట్టిన డబ్బు కూడా పసిడి కొనేందుకే ఉపయోగిస్తుంటారు. పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు నగదు పొదుపు చేస్తుంటారు కూడా. రకరకాల డిజైన్లలో ఉన్న ఆభరణాలు అలంకరించుకోవడం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

భారత్ లో బంగారానికి భారీ డిమాండ్

ఇక స్తోమతకు తగ్గినట్లుగా ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో పసిడికి డిమాండ్ ఎక్కువ. అందుకే ప్రతి ఏటా టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంటుంది. ప్రపంచంలో బంగారం దిగుమతి (Gold Import) చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందంటే ఇక్కడ పసిడికి ఉన్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్నిరోజులుగా మార్కెట్లో పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా రోజుల నుంచి బంగారం రేట్లు రూ.85,000 కుపైగా ఉంటున్నాయి.

ట్రంప్ నిర్ణయాలతో మార్కెట్లు కుదేల్

బంగారంతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటి రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీకార సుంకాలు అంటూ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి వల్ల మార్కెట్లు కుదేలైపోతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నెలకొంటుంది. దీని వల్ల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరి ఇవాళ ( మార్చి 6వ తేదీ) హైదరాబాద్ మహానగరంలో గోల్డ్ ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో చూద్దామా..?

హైదరాబాద్ లో బంగారం ధరలు

హైదరాబాద్మార్కెట్లో బంగారం ధర (Gold Rates) వరుసగా రెండో రోజూ పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 600 పెరిగి  రూ. 87, 980 వద్దకు చేరింది.  22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై  రూ. 550 పెరిగి రూ. 80, 650 వద్ద అమ్ముడుపోతోంది. మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,07,000 మార్క్ వద్ద పలుకుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *