గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates) నేడూ (ఫిబ్రవరి 24) స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పుత్తడి రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్(Hyderabad)లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 80,550 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమై పసడి రేటు రూ.100 పెరిగి రూ. 87,870వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి(Silver Price)పై రూ. 1000 పెరిగి ప్రస్తుతం రూ. 1,08,000గా ఉంది. తెలంగాణ, ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు(Stock Markets) ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ(Nifty) 22,639 (-156), BSE సెన్సెక్స్ 74,768 (-580) వద్ద చలిస్తున్నాయి. టెక్ కంపెనీలు HCL, టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, సుజుకీ, బజాజ్ ఫిన్ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇక నేడు రూపీ వ్యాల్యూ(Rupee Value) ఒక అమెరికన్ డాలర్కు రూ.86.96గా ఉంది.







