మిడ్ క్యాప్ టోబాకో(Tobacco Company) రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ (Godfrey Phillips India Ltd) తన షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. కంపెనీ డైరెక్టర్లు ఆగస్టు 4, 2025న బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక ఫలితాలపై చర్చించడమే కాకుండా, బోనస్ షేర్ల ప్రతిపాదనపై ఆమోదం తెలపనున్నారు.
కంపెనీ ప్రకారం, షేర్ హోల్డర్ల( Investors)కు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చే ప్రతిపాదతను పరిశీలించి ఆమోదం తెలుపనున్నారు. అంటే ఒక షేరు ఉన్న వారికి రెండు ఉచిత బోనస్ షేర్లు(Buy 1 Share, Get 2 More Free) లభించనున్నాయి. ఈ కంపెనీ గత ఏడాదిలోనే 124 శాతం లాభం ఇచ్చింది. ఐదేళ్లలో చూస్తే 931 శాతం రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్(Multibagger Stock) స్టాక్ ఇది. ఐదేళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు అలాగే వదిలేసినా వారికీ దాని విలువ ₹10 లక్షలు అయి ఉంటుంది.
1844లో స్థాపితమైన ఈ సంస్థ దేశంలో అతిపెద్ద సిగరెట్ల తయారీ కంపెనీల్లో ఒకటి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. 2024 చివరి నాటికి 1123 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 48,950 కోట్ల వద్ద ఉంది. ఇన్వెస్టర్లు రాబోయే బోనస్ ప్రక్రియపై అప్డేట్స్ కోసం కంపెనీ అధికారిక ప్రకటనల్ని గమనిస్తూ ఉండాలి.






