పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 20 ఏళ్ల తర్వాత సీన్ రిపీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)షూటింగ్ ఇప్పటికే పూర్తయి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజి’ (OG)సినిమా కూడా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తాజాగా పవన్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’Ustad Bhagath Sing షూటింగ్లోనూ పాల్గొంటున్నాడు.

అయితే పవన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ అరుదైన రికార్డును సెట్ చేయబోతున్నాడు. ఆయన సినీ ప్రస్థానంలో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల కావడం చాలా అరుదు. గతంలో కేవలం 2006లో మాత్రమే ‘బంగారం’, ‘అన్నవరం’ సినిమాలు ఏడు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇప్పుడీ సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. 2025లో కేవలం మూడు నెలల గ్యాప్‌లో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అధికారిక రిలీజ్ డేట్స్ ఇంకా ఖరారవ్వనప్పటికీ, ఈ రెండు చిత్రాలు 2025లో తప్పకుండా థియేటర్లలోకి రానున్నాయి.

ఇరవై ఏళ్ల గ్యాప్ తర్వాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్‌పై అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ నుంచి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ హైప్ నెలకొంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *