ఉద్యోగులకు గూగుల్ షాక్.. 10 శాతం లేఆఫ్స్

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google Layoffs) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మరోసారి ఉద్యోగాల్లో కోత విధించింది. గతంలోనే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన ఈ సంస్థ తాజాగా మేనేజ్‌మెంట్‌ రోల్స్‌లో ఉన్న వారిని ఇంటికి పంపించేసింది. మేనేజర్‌, డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందిని తొలగించింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆల్‌ హ్యాండ్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తెలిపింది.

ఓపెన్‌ఏఐ వంటి ఏఐ సంస్థల (Open AI) నుంచి పోటీ పెరుగుతున్న వేళ తన సామర్థ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పిచాయ్ తెలిపినట్లు పేర్కొంది. తాజా నిర్ణయంలో భాగంగా కొందరి హోదాలను తగ్గించి వారిని వ్యక్తిగత పాత్రలకే పరిమితం చేయనున్నట్లు తెలిపింది. మరికొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించింది.

గడిచిన రెండేళ్లుగా గూగుల్‌ (Google Layoffs Updates) తన కంపెనీలో రీ ఆర్గనైజింగ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమ సంస్థ 20 శాతం మరింత సమర్థంగా పని చేయాలని 2022లో సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ క్రమంలోనే 2023లో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక తాజాగా మరోసారి 10 శాతం లేఆఫ్స్ ప్రకటించింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *