ఫార్ములా ఈ రేసు.. గ్రీన్‌కో నుంచి BRSకు రూ.41 కోట్లు

హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేసు కేసు (Formula E Race Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ విచారణ ముమ్మరం చేశాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక విషయాలు బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్ కో (Green Co) సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో రూ.41 కోట్లు చెల్లించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 2002 ఏప్రీల్ 8 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య 26 సార్లు బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఏసీబీ ఆఫీసు నుంచి వెనుదిరిగిన కేటీఆర్

ఇక ఈ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ (KTR ACB Case), ఆయన లీగల్ టీమ్ ను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడగా.. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. తాను మర్యాదగా విచారణకు సహకరిస్తుంటే.. ఇంతమంది పోలీసులెందుకు? అని ఆయన ప్రశ్నించారు. కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

నాతోపాటు లాయర్లుంటే నష్టమేంటి?

‘‘ఈరోజు ఏసీబీ ఆఫీసుకు రమ్మన్నారు. నన్ను అడుగుతున్న సమాచారమంతా సర్కార్ వద్దే ఉంది. గతంలో ఓ మంత్రిగా నేను నిర్ణయం తీసుకుంటే.. నా వద్ద సమాచారం ఉందని అనుకుంటున్నారు. నా వాదనను ఇప్పటికే హైకోర్టుకు వివరించాను. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చట్టాలపై గౌరవంతో ఏసీబీ ఆఫీసుకు వస్తే.. నా లాయర్ ను లోనికి రావద్దంటున్నారు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నప్పుడు ఇంతమంది పోలీసులెందుకు? న్యాయవాదిని అనుమతించమని ఏసీబీ వాళ్లు చెప్పాలి కానీ పోలీసులెందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు. నాతో పాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టమేంటి?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *