Kannappa: ‘కన్నప్ప’కు ఐటీ, జీఎస్టీ సెగ.. విష్ణు ఇళ్లు, ఆఫీస్‌లో అధికారుల సోదాలు

ఎల్లుండి (జూన్ 27) రిలీజ్ కానున్న కన్నప్ప(Kannappa) మూవీకి షాక్ తగిలింది. కన్నప్ప సినిమా నిర్మాతలు IT, GST ఎగవేసినట్లు ఆరోపణలతో హీరో మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు సినిమాలోని ప‌లువ‌రి ఇళ్ల‌లో జీఎస్టీ అధికారులు(GST officials) త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మాదాపూర్‌(Madhapur)లోని విష్ణు కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా బడ్జెట్‌(Movie Budget)కు సంబంధించిన ఖర్చులు, బ్యాలన్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఏ ఏ అకౌంట్ల నుంచి నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. TAX, GST ఎంత వరకు చెల్లించారనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు(Mohan Babu) హుటాహుటిన విష్ణు ఆఫీస్‌కు వచ్చారు. అయితే ఐటీ, జీఎస్టీ రైడ్స్ గురించి తనకు తెలియదని.. సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు మంచు విష్ణు తెలిపారు.

రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని వార్తలు

కాగా సుమారు రూ.120 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించారని వార్తలు వస్తున్నాయి. గతంలో కన్నప్ప బడ్జెట్(Kannappa Budget) గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఆయన ఇంట్లో, చిత్రయూనిట్ సభ్యుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్(Prabhas), మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohan lal), బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) తదితరులు పలు కీలక పాత్రల్లో నటించారు.

Exclusive - Vishnu Manchu: The budget of Kannappa is so high, I need the  star power of Prabhas, Mohanlal and Akshay Kumar to....

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *