Air India Plane Accident: విమాన ప్రమాదంపై గుజరాత్ సర్కార్ కీలక ప్రకటన

అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది విమాన ప్రయాణికులు(Air passengers) కాగా, కొందరు స్థానికులు(the natives) కూడా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మృతుల సంఖ్యపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటనతో తెరపడింది. కాగా జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌(London)కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌(Air India Dreamliner) విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 275 మంది మరణించగా, వారిలో 241 మంది విమాన ప్రయాణికులని, మిగిలిన 34 మంది విమానం కూలిన ప్రాంతంలోని స్థానికులని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటి వరకూ 260 మంది మృతుల గుర్తింపు

ఇప్పటివరకు డీఎన్ఏ పరీక్షల(DNA tests) ద్వారా 260 మంది మృతులను గుర్తించగా… వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. గుర్తించిన మృతదేహాల్లో 256 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో, 11A సీటులో కూర్చున్న ఒక్క వ్యక్తి మినహా మిగతా వారందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *