Hari Hara Veera Mallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌(Trailer)ను జూలై 3న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. జూలై 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

‘వీరమల్లు’ అనే బందిపోటు యోధుడి సాహసగాథగా

మొఘల్ కాలం నాటి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. మొఘల్ పాలకుల అధికారాన్ని ధిక్కరించి, ప్రజల పక్షాన నిలిచిన ‘వీరమల్లు’ అనే బందిపోటు యోధుడి సాహసగాథగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ(Director AM Jyothi Krishna) పూర్తి చేశారు. అంతకుముందు, క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు(Post Production Works) శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(MM Kiravani) అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. విడుదలైన నాలుగు పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Baby Deol) కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *