HHMV Prerelease event: ‘హరి హర వీరమల్లు’ తగ్గేదేలే.. నేడు మరో ప్రీరిలీజ్ ఈవెంట్

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veera Mallu)’ రేపు (జులై 24) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో విడుదలకు ఒకేరోజు సమయం ఉండటంతో ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని వీరమల్లు టీమ్ భావిస్తోంది. ఇప్పటికే ప్రెస్ మీట్లు, హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్(Prerelease event) నిర్వహించి గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇక ఈరోజు (జులై 23) వైజాగ్‌(Vizag)లో మరో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌(AU Convention Center)లో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ఈవెంట్ నిర్వహిస్తే ఒకే సినిమాకు రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు నిర్వహించిన తెలుగు చిత్రంగా HHMV నిలువనుంది.

1000 నుంచి 1500 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి

కాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్‌తో పాటు, చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్‌కు 1000 నుంచి 1500 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుందని, భద్రతా కారణాల రీత్యా పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయింది, U/A సర్టిఫికెట్ పొందింది. రన్‌టైమ్ 2 గంటల 42 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం కొన్ని సర్‌ప్రైజ్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

HHVM movie story: 'హరి హర వీరమల్లు' కు నిజాం రాజుకు ఏంటి - OkTelugu

ఈ మూవీ 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన యాక్షన్-అడ్వెంచర్ డ్రామా, ఇందులో పవన్ కల్యాణ్ ఒక ధీరోదాత్త యోధుడి పాత్రలో కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), నర్గీస్ ఫాక్రీ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *