Harish Rao: రేవంత్ బూతులపై కాదు.. పాలనపై దృష్టి పెట్టు: హరీశ్‌రావు

Mana Enadu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)పై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఇవాళ హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడన అందుతోందని తెలుస్తోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపం బట్టబయలైందని, ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని హరీశ్ రావు తెలిపారు.

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ధర్నాలు(Dharnas) జరుగుతున్నాయని అన్నారు. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లాడడమే CMకు తెలుసని, హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన బూతులపై కాకుండా పాలనపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. హామీలు మాత్రమే కాకుండా, కేసీఆర్(KCR) గతంలో మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాల(Schemes)ను కూడా అమలు చేయడం లేదని తెలిపారు. బతుకమ్మ చీరెలు, రైతు బంధు, రుణమాఫీ(Bathukamma Sarees, Rythu Bandhu, Loan Waiver) లేవని చెప్పారు. రాష్ట్రంలో ప‌త్తి కొనుగోళ్లు జ‌ర‌గ‌డం లేదు. రూ. 7521కు క్వింటాల్ ప‌త్తి కొంటామ‌ని మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించారు. కానీ రైతులు రూ. 5500కు ప‌త్తి అమ్ముకుంటున్న ప‌రిస్థితి. మ‌ద్ద‌తు ధ‌ర రాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ఉలుకుప‌లుకు లేదు.

 పండుగ వేళ 144 సెక్షన్?

హైదరాబాద్‌(HYD)లో 144 సెక్షన్ విధించడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ‘పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో ఎవరైనా 144 సెక్షన్ పెడతారా? పెళ్లిళ్లకు ఎవరూ పోవద్దా? షాపింగ్‌లకు వెళ్లి దుస్తులు కొనుక్కోవద్దా? బంగారం షాపులకు వెళ్లి బంగారం కొనుక్కోవద్దా? క్రాకర్స్ కొనుక్కోవద్దా? ఎక్కడా నలుగురైదుగురు గుమిగూడకూడదా? ఇదేమీ రాజ్యం. రజాకార్ల రాజ్యంలాగే ఉంది ఇది’ అని హరీశ్ ఫైర్ అయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *