Harish Rao: హరీశ్ రావుకు అస్వస్థత.. అస్పత్రికి తరలింపు

BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అస్వస్థత(For illness)కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు(Formula E racing case)కు సంబంధించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం KTR, హరీశ్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, అప్పటికే హరీశ్ రావు జ్వరం(Fever)తో మధ్యలోనే ఇబ్బంది పడటంతో వెంటనే ఆయనను అక్కడి నుంచి తరలించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు

వెంటనే పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రిలో చేర్పించారు. హరీశ్ రావు ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా అంతకుముందు హరీశ్ రావు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కౌంటర్ వేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.

దగ్గినా.. తుమ్మినా.. కేసులు పెడుతున్నారు..

ప్రస్తుతం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని, ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెడుతూ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. దగ్గినా.. తుమ్మినా.. కేసులు(Cases) పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు. ఇక కేటీఆర్ సామర్థ్యాన్ని వివరిస్తూ.. “KTR ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి” అని అన్నారు. ఆయనను ముట్టుకుంటే భస్మం అయిపోతారన్నారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, నాయకత్వ గుణాలు, కృషి ఏ రాజకీయ కుట్రలకైనా సమాధానం అవుతాయని హరీశ్ పేర్కొన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *