Rains: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు(జూన్ 12), రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయవ్య దిశలవైపు గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ(IMD) ప్రకారం, ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు 

ఈ మేరకు తెలంగాణ(Telangana)లోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు

అటు ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నేడు(జూన్ 12), రేపు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చంది. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *