Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో (జులై 26, 27) రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే APలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

Heavy rains to continue in Kerala due to low pressure in Bay of Bengal: IMD  | India News - Business Standard

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: సీఎం చంద్రబాబు

తెలంగాణ(Telangana)లో హైదరాబాద్‌తో సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై, ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులతో సమీక్ష నిర్వహించి, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఏపీలో భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు అధికారులకు కీలకఆదేశాలు! | Heavy rains  in AP.. CM Chandrababu issues key orders to officials! - Telugu Oneindia

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

అటు తెలంగాణలోనూ సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు(Traffic Issues) తలెత్తాయి.ఈ అల్పపీడన ద్రోణి తుఫానుగా మారే సూచనలు ఉన్నందున మరింత జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

CM Revanth, officials, heavy rains, Telangana

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *