Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కళియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడం, స్కూళ్లు, కాలేజీల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తులు(Devotees) కిటకిటలాడుతున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనాని(Sarva Darshan)కి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఇక శుక్రవారం అర్ధరాత్రి వరకు ఏడుకొండలవాడిని 71,721 మంది భక్తులు దర్శించుకోగా, 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో జూన్ 2 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams of Sri Govindaraja Swamy) జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు రేపు (ఆదివారం) సాయంత్రం అంకురార్పణం చేయనున్నట్లు TTD పేర్కొంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *