పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎఫెక్ట్.. తిరుమలలో హై అలెర్ట్

జమ్ముకశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తిరుమలలో హై అలర్ట్ (Tirumala High Alert) ప్రరకటించారు.  అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ చేశారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యటకులు మరణించారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. మరోవైపు దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంపై కఠిన ఆంక్షలు అమలు చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *