PAN 2.0: ఉచితంగా pan card.. ఇలా పొందాలి

Mana Enadu : కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే పాన్ 2.0 ప్రాజెక్టు ప్రకటించింది. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు జారీ చేసేందుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం కోసం భారీగా బడ్జెజ్​ కేటాయించింది. పన్ను చెల్లింపుదారులు పాత అడ్రస్ కొత్త పాన్ కార్డులో ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకసారి ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం వద్ద అడ్రస్ అప్​డేట్ (pan card update) అయితే క్యూఆర్ కోడ్ ఇ-పాన్ కార్డును (E pan card) వారి మెయిల్ ఐడీకి పంపిస్తారు.

వెబ్​సైట్లు ఇవే..

ఆధార్ ఆధారంగా ఆన్‌లైన్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఉచితంగా అడ్రస్ అప్డేట్ చేసుకునేందుకు ట్యాక్స్ పేయర్లు NSDL వెబ్‌సైట్ ద్వారా https://www.onlineservices.nsd.com/paam/endUserAddressUpdate.html లింక్ ద్వారా అప్డేట్ చేయవచ్చు. అలాగే పాన్ కార్డు యూటీఐ ఐటీఎస్ఎల్ జారీ చేసినట్లయితే https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.

కొత్త పాన్ ఇలా పొందండి

  • ముందుగా పైన పేర్కొన్న లింక్ ద్వారా NSDL ఇ-పాన్ పోర్టల్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో మీ పాన్ కార్డ్, ఆధార్, పుట్టిన తేదీ తదితర వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అప్​డేట్ ఆప్షన్‌ పైన టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
  • ఆ తర్వాత కొత్త వెబ్‌ పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ఆధార్ ఆధారిత ఇ–కేవైసీ జనరేట్ చేయవచ్చు. ఆ తర్వాత కంటిన్యూ విత్ ఇ-కేవైసీపై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • ఇన్‌కమ్ ట్యాక్స్ రికార్డుల్లో ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ అప్డేట్ చేసుకునేందుకు ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు మార్చుకోవాలంటే కొత్తవి ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ మార్చితే కొత్త నంబర్‌కి ఓటీపి వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అథెంటికేట్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్‌కు సంబంధించిన అడ్రస్ వివరాలు కనిపిస్తాయి. చెక్ చేసుకొని వెరిఫై పై క్లిక్ చేయాలి.
  • కొత్త వెబ్ పేజీలోకి వెళ్తుంది. అడ్రస్ అప్​డేట్​పై క్లిక్ చేయాలి. దీంతో మీ అడ్రస్ అప్​డేట్ అయిపోతుంది.
  • ఒకసారి అడ్రస్ అప్డేట్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి ఇ-పాన్ పంపిస్తారు. రూ.50 చెల్లించినట్లయితే కార్డు ప్రింట్ చేసి పంపిస్తారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *