Tollywood: ఈ ముగ్గురు టాప్ హీరోయిన్లకూ రీ-ఎంట్రీలో నిరాశే!

టాలీవుడ్‌(Tollywood)లో ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్స్ జెనీలియా డిసౌజా(Genelia D’Souza), లయ(Laya), అన్షు(Anshu) ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారి కమ్‌బ్యాక్ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ముగ్గురు నటీమణులు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ స్టార్‌డమ్ సాధిస్తారని భావించినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యింది. మరి ఈ ముగ్గురు నటించిన తాజా చిత్రాలేంటో ఓ లుక్ వేద్దామా..

జెనీలియా డిసౌజా: ‘బొమ్మరిల్లు(Bommarillu)’ సినిమాతో హాసినిగా గుండెల్లో చెరిగిపోయిన జెనీలియా, దాదాపు దశాబ్దం విరామం తర్వాత ‘వేద్’ సినిమాతో మరాఠీలో, ‘సితారే జమీన్ పర్(Sitare Zameen Par)’తో బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ‘జూనియర్(Junior)’ సినిమాతో తిరిగి రాణించాలని భావించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. పాత్రల ఎంపికలో జాగ్రత్తలు, ప్రేక్షకుల అంచనాలు తీర్చడంలో సవాళ్లు ఆమె రీ-ఎంట్రీని ప్రభావితం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సిద్ధార్థ్, జెనీలియా బొమ్మరిల్లు యొక్క 15 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటారు, ఆ జ్ఞాపకాలను మళ్లీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను - ఇండియా ...

లయ: ‘స్వాగతం’, ‘మిస్సమ్మ(Missamma)’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన లయ, లాంగ్ గ్యాప్ తర్వాత తమిళ చిత్రాల్లో కనిపించింది. టాలీవుడ్‌లో ఆమె రీ-ఎంట్రీ ప్రామిసింగ్ పాత్రల కొరత, పోటీ వాతావరణం కారణంగా ఊపందుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో మారిన ట్రెండ్స్, కొత్త తరం నటీమణుల ఆధిపత్యం ఆమె కమ్‌బ్యాక్‌ను సవాలుగా మారింది. తాజాగా ఆమె ‘తమ్ముడు(Thammudu)’తో మెరవగా ఆ మూవీ ఆకట్టుకోలేకపోయింది.

Laya: అభినయ 'లయ' విన్యాసాలు! - NTV Telugu

అన్షు: ‘మన్మథుడు’లో నటనతో గుర్తుండిపోయిన అన్షు, చిన్న విరామం తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, ఆమె కమ్‌బ్యాక్ ఆశించినంత ఆకట్టుకోలేదు. పరిమిత స్క్రీన్ స్పేస్, సరైన అవకాశాల కొరత వంటి అంశాలు ఆమె రీ-ఎంట్రీని బలహీనపరిచాయి. ఇటీవల ఆమె మజాకా(Mazaka) సినిమాతో మరోసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చానా.. ఆ మూవీ కాస్త డీలా పడింది.

Anshu Ambani : 'మన్మథుడు' సమయంలో చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను.. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను.. | Manmadhudu actress anshu ambani viral comments about her exit of industry ...

దీంతో ఈ ముగ్గురు నటీమణుల రీ-ఎంట్రీ వారితోపాటు ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. ఇందుకు కారణాలూ లేకపోలేదు. మారుతున్న సినిమా ట్రెండ్స్, కొత్త నటీమణుల ఆధిపత్యం, సరైన కథలు, పాత్రల ఎంపికలో సవాళ్లు ప్రతికూలంగా మారాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *