‘నేను పేరు చెప్పను.. ఫ్యాన్ ఆర్మీస్ దారుణంగా ట్రోల్ చేస్తాయి’

Mana Enadu : ఇటీవల టెస్టుల్లో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే.  ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆట తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేయడంపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉందని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand)ను ఎక్స్‌లో నెటిజన్లు అడగగా..  ప్రత్యర్థి జట్టు 11 మందితో ఆడుతుంటే భారత జట్టు కేవలం 9 మందితోనే ఆడుతుందని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.

వాళ్లు లేకుండా ఆడి గెలిచారు

“గత ఆస్ట్రేలియా టూర్ (Team India Australia Tour) లో స్టార్‌ ప్లేయర్స్  లేకుండా టీమ్‌ ఇండియా చాలా బాగా ఆడి గెలిచింది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ .. నేను పేర్లు చెప్పను. ఎందుకంటే వారి “సోషల్ మీడియా ఆర్మీలు” నన్ను దారుణంగా ట్రోల్ చేస్తాయి. వాళ్లిద్దరు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్లు ఇలా వెళ్లి అలా హడావుడిగా వచ్చారు. స్టార్ ప్లేయర్స్ అంటే అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన చేసి అభిమానుల్లో ఆదరణ తగ్గకుండా చూసుకోవాలి.’

దారుణంగా ట్రోల్ చేస్తారు

టీమిండియా వైఫల్యాలు చూస్తుంటే నేను మౌనంగా ఉండిపోయాను. మన టీమ్ చాలా కాలంగా కేవలం 9 మంది ప్లేయర్స్ తోనే ఆడుతోంది. క్రికెట్ కు ఎంతో ఆదరణ ఉన్న భారత్ ఈ భారాన్ని మోయడం కరెక్టేనా? ఆ స్టార్ ప్లేయర్స్ సోషల్ మీడియా ఆర్మీలు (Social Media Armies) ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడల్లా దారుణంగా ట్రోలింగ్ కు దిగుతాయి.’’ అని సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *