ICC CT-2025: నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. తొలిపోరులో పాక్‌తో కివీస్ ఢీ

ఎనిమిది జట్లు.. 15 మ్యాచులు.. దాదాపు 20 రోజుల పాటు అభిమానులను అలరించేందుకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) సిద్ధమైంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ ఈవెంట్‌ నేటి (ఫిబ్రవరి 19) నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్‌(PAKvsNZ) జట్లు తలపడనున్నాయి. 1996 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఆ దేశంలో జరుగబోతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే కావడం విశేషం. ఛాంపియన్స్‌ ట్రోఫీని మొదటిసారి 1998లో నిర్వహించగా, అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ(ICC Knockout Trophy)గా పిలిచేవారు. కానీ 2002 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరుగా నామకరణం చేశారు. అలాగే 2009 నుంచి నాలుగేళ్లకోసారి జరపాలని నిర్ణయించారు. కానీ 2017లో ఈ టోర్నీకి బ్రేక్ వేసిన ఐసీసీ మళ్లీ ఏ ఏడాది నుంచి నిర్వహించాలని నిర్ణయించింది.

టాప్-8లో నిలిచిన జట్ల మధ్యే పోరు

పాకిస్థాన్, UAE సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీలో.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టులో గ్రూపులోని ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచు ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత టైటిల్‌ పోరు ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఫైనల్‌ మ్యాచ్‌ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ భారత్‌ తుది పోరుకు అర్హత సాధిస్తే వేదిక దుబాయ్‌కు మారుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Pakistan vs New Zealand, Champions Trophy 2025: Head-to-head record as PAK  face NZ to kick off tournament | Crickit

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *