బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ జూ ఎన్టీఆర్(Jr NTR) కాంబోలో రూపొందిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్టు 14న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్(Trailer), పాటలు ఇప్పటికే అభిమానులను ఆకర్షించాయి. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి టికెట్ రేట్ల(Ticket Rates)పై ఏపీ సర్కార్(AP Govt) మేకర్స్కు శుభవార్త అందించింది. ‘వార్ 2’ చిత్రానికి టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర ₹220, సెకండ్ క్లాస్ టికెట్ ₹150గా ఉండనుంది. అలాగే ఒక అదనపు షో కేటాయించడం ద్వారా చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను పెంచుకునే అవకాశం కల్పించింది.
![]()
ఏపీ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు
ఈ నిర్ణయంపై హీరో జూ ఎన్టీఆర్(NTR) సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని(AP Govt)కి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా(SM)లో ట్వీట్ చేస్తూ, “వార్ 2 విడుదల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్తో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
My sincere thanks to the Honourable CM of Andhra Pradesh, Sri @NCBN garu and the Honourable Deputy CM, Sri @PawanKalyan garu, for passing the new G.O. for the #War2 release. I also extend my gratitude to the Cinematography Minister Sri @kanduladurgesh garu.
— Jr NTR (@tarak9999) August 12, 2025
రజినీకాంత్ ‘కూలీ’ని ఢీకొట్టనున్న వార్-2
కాగా ‘వార్ 2’ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్గా నటిస్తుండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించింది. ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్తో ఆకట్టుకోనుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి కనిపించడం ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం రజినీకాంత్ నటించిన ‘కూలీ(Coolie)’తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనుంది. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలతో రెండు చిత్రాలు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.






