INDvsENG 3rd T20: భారత్ ఓటమి.. కోచ్ గంభీర్‌ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

ఇంగ్లండ్‌(England)తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 26 పరుగులతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 రన్స్ చేయగా.. సూర్య సేన ఓవర్లన్నీ ఆడి 145/9కే పరిమితమైంది. దీంతో ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ఓడినా 5 వికెట్లతో రాణించిన భారత బౌలర్‌ వరుణ్ చక్రవర్తికి(Varun Chakravarthi) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచులో జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే..

గత రెండు మ్యాచుల్లాగానే టాస్ నెగ్గిన భారత కెప్టెన్ సూర్య(SKY) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లు బౌలర్లూ రాణించారు. కానీ బ్యాటింగ్ విషయంలోనే యంగ్ ప్లేయర్లు తడబడ్డారు. అందుకుతగ్గట్లు కోచ్ గంభీర్ (Gambhir)నిర్ణయాలు మనం ఓడిపోవడానికి కారణమయ్యాయని సోషల్ మీడియా(SM)లో అభిమానులు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే జట్టుకు నష్టం జరిగిందని అంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో వికెట్‌గా రావాల్సిన ధ్రువ్ జురెల్‌(Dhruv Jurel)ను ఎనిమిదో వికెట్‌కు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. జురెల్ కంటే ముందొచ్చిన సుందర్ 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత అక్షర్‌(Axar Patel)ను పంపగా అతనూ 16 బంతుల్లో 15 రన్స్ చేసి నిరాశపర్చాడు. దీంతో అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరగడంతో తర్వాతి ప్లేయర్లపై ఒత్తిడి పెరిగిందని దీంతోనే భారత్ ఓడిందని కోచ్ గంభీర్‌పై మండిపడుతున్నారు.

కొనసాగుతున్న SKY పేలవ ప్రదర్శన

ఇదిలా ఉండగా మ్యాచులోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) పేలవ షాట్ ఆడి నిరాశపర్చాడు. సూర్య గత 10 T20ల్లో కేవలం 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. దీంతో SKYపైనా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ(Captancy) రాగానే ఆటపోయిందంటూ మాజీలు, అభిమానులు విమర్శిస్తున్నారు. తర్వాతి మ్యాచుల్లోనైనా సూర్య రాణించాలని, లేకపోతే భారత్‌కు కష్టమవుతుందంటున్నారు. కాగా ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈనెల 31న పుణే(Pune) వేదికగా జరగనుంది.

Image

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *