Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. క్షేమంగా స్వదేశానికి భారత విద్యార్థులు

ఇరాన్‌ మిలటరీ బేస్ క్యాంపులు(Military base camps), చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌(Iran)లో 600 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు(Human rights groups) తెలిపాయి. దాదాపు 1400 మంది గాయపడినట్లు తేలింది. మృతుల్లో 239 మంది టెహ్రాన్‌ పౌరులు,126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌(Israel-Iran War) మధ్య పరస్పర క్షిపణి దాడులు(Missile attacks) కొనసాగుతున్నాయి.

Iran-Israel 'threshold war' has rewritten nuclear escalation rules

ఇరాన్ నుంచి భారత్ చేరుకున్న 110 మంది విద్యార్థులు

ఇక మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల(Indian citizens)ను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘Operation Sindhu’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 110 మంది భారతీయ పౌరులతో కూడిన తొలి విమానం ఈరోజు (జూన్ 19) ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో 90 మంది జమ్మూకశ్మీర్‌(J&K)కు చెందిన విద్యార్థులు(Students) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6E-9487 స్పెషల్ ఫ్లైట్లో వీరంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్(External Affairs Kirti Vardhan Singh) స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి విద్యార్థులు, ఇతర పౌరులకు స్వాగతం పలికారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *