టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్ (India Womens Team) అదరగొట్టింది. ఇంగ్లండ్(England)తో జరిగిన 4వ టీ20లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే నెగ్గింది. ఈ విజయంతో ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ను సాధించి చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్(Manchester) వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సోఫియా డంక్లీ (22) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాధా యాదవ్(Radha Yadhav) 2, శ్రీ చరణి 2, అమన్జోత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.
17 ఓవర్లలోనే పూర్తి చేశారు..
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ సేన 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీంలో స్మృతి మంధాన (32), షెఫాలీ వర్మ (31), రోడ్రిగ్స్ (24*), హర్మన్ప్రీత్ కౌర్ (26) రాణించారు. కాగా ట్రెంట్ బ్రిడ్జ్(Trentbridge)లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఇక బ్రిస్టల్(Bristol)లో జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగులతో నెగ్గింది. ఓవల్(Ovel)లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. అద్భుత బౌలింగ్తో రాణించిన రాధా యాదవ్ (4 ఓవర్లలో 15/2)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
For her strong performance with the ball and two well judged catches, Radha Yadav is the Player of the Match 🏆#TeamIndia win the 4th T20I by 6 wickets and take an unassailable lead of 3-1 ✨
Scoreboard ▶️ https://t.co/QF3qAMduOx#ENGvIND | @Radhay_21 pic.twitter.com/2CpqSRibYq
— BCCI Women (@BCCIWomen) July 9, 2025
12న ఎడ్జ్బాస్టన్ వేదికగా చివరి టీ20
తాజాగా నిన్న రాత్రి జరిగిన మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ను పట్టేసింది. కాగా ఈనెల 12న ఐదో మ్యాచ్ ఎడ్జ్బాస్టన్(Edgebaston) వేదికగా జరగనుంది. ఇరుదేశాల మధ్య ఇంతవరకు 6 ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. అన్ని సిరీస్లను ఇంగ్లండే గెలిచింది. 2006లో డర్బీ(Durby)లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక T20లో భారత్ గెలుపొందింది.






