భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్(Warships)లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని నావికాదళ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయగిరి (F–35), హిమగిరి (F–34)లను ప్రధాని మోదీ(PM Modi) ‘మేక్ ఇన్ ఇండియా(Make In India), ఆత్మనిర్భర్ భారత్’ పిలుపులో భాగంగా రూపొందించారు. ప్రాజెక్ట్ 17–ఎ స్టెల్త్ ఫ్రిగేట్లలోని రెండో నౌక అయిన ఉదయగిరిని ముంబైలోని మజ్ గాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించింది.

దాదాపు 6,700 టన్నుల బరువు
కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించిన P–17A నౌకలలో హిమగిరి మొదటిది. ఉదయగిరి నావల్ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక. ఈ యుద్ధనౌకల్లో అత్యాధునిక, సూపర్ సోనిక్ ఆయుధాలను ఉంచనున్నారు. దాదాపు 6,700 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకలు శివాలిక్-క్లాస్ ఫ్రిగేట్స్ కంటే దాదాపు ఐదుశాతం పెద్దవి.

తూర్పు నౌకాదళంలో ప్రధాన కేంద్రంగా విశాఖ
ఈ రెండింటి ఆయుధాల భాగంలో సూపర్సోనిక్ సర్ఫేస్-టు-–సర్ఫేస్ క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు, 76MM MR గన్స్తో పాటు యాంటీ–సబ్మెరైన్/అండర్వాటర్ వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. భారతీయ నౌకాదళ పటిష్ఠత, సత్తాని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
Tomorrow, 26th August, I shall be in Visakhapatnam to attend the Commissioning Ceremony of the latest state of the art Project 17A multi-mission stealth frigates Udaygiri and Himgiri.
This will be the first occasion when two frontline surface combatants, constructed at two… pic.twitter.com/taFYhVkFxq
— Rajnath Singh (@rajnathsingh) August 25, 2025






