India vs Bangladesh: రోహిత్, కోహ్లీ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్-బంగ్లా సిరీస్ వాయిదా

భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు T20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో రద్దీ, రాజకీయ అస్థిరత(Political instability), భద్రతా ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతల వల్లే..

గత ఏడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం(Sheikh Hasina’s government) కూలిపోవడంతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు(Tensions in bilateral relations) ఈ వాయిదాకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ టూర్‌ను నిర్వహించాలని BCCI భావిస్తోంది. ఈ సిరీస్ ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా ఉంది.

వారిద్దరూ అక్టోబర్ వరకూ వేచి ఉండాల్సిందే..

ఈ వాయిదా వల్ల రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లాంటి సీనియర్ ఆటగాళ్ల అభిమానులకు నిరాశే మిగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) తర్వాత వీరు వన్డే క్రికెట్‌లో తిరిగి కనిపించాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026లో భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తుందని ఆశతో ఉంది. కాగా సిరీస్ షెడ్యూల్, తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీసీబీ తెలిపింది.

Virat Kohli, Rohit Sharma & Ravindra Jadeja retire from T20 internationals  after World Cup win - BBC Sport

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *