IPL Auction 2025: ఐపీఎం వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

ఐపీఎం వేలం మొదలు కానుంది. పలువురు స్టార్​ ప్లేయర్స్​ ఆయా ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిపై ఎన్ని కోట్లైనా కుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రాంచైజీల వద్ద ఎంత ఎక్కవ డబ్బు ఉంటే అంత ఎక్కువ ధర పెట్టి తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీల వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఫ్రాంచైజీల్లో అత్యధికంగా పంజాబ్స్​ కింగ్స్​ వద్ద రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్​ స్టార్​ ప్లేయర్​ జోస్​ బట్లర్​తోపాటు మరికొందరిని పంజాబ్​ యాజమాన్యం సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత బెంగళూరు వద్ద రూ.83 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ వద్ద రూ.76.25 కోట్లు, గుజరాత్​ టైటాన్స్​ వద్ద 69 కోట్లు, లక్నో సూపర్​ జెయింట్స్​ వద్ద రూ.69 కోట్లు, చెన్నై సూపర్​ కింగ్స్​ వద్ద రూ.55 కోట్లు, కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్రాంచైజీ వద్ద రూ.51 కోట్లు, ముంబయి ఇండియన్స్​ వద్ద రూ.45 కోట్లు, సన్​రైజర్స్​ హైదరాబాద్​ వద్ద రూ.45 కోట్లు, అతి తక్కువగా రాజస్థాన్​ రాయల్స్​ ఫ్రాంచైజీ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల వద్ద మొత్తం కలిసి రూ.641.5 కోట్లు ఉన్నాయి.

వేలంలో స్టార్​ ప్లేయర్స్​ వీళ్లే..
ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్​ రిషభ్​ పంత్​ (Rishabh Pant), లక్నో సూపర్​ జైంట్స్ మాజీ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​పై (KL Rahul) యాజమాన్యాలు కన్నేశాయి. బ్యాటింగ్​ మాత్రమే కాకుండా వికెట్​ కీపింగ్​, కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న వీరిపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. ​గత సీజన్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ టీమ్​కు కప్​ అందించిన కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ (shreyas iyer) సైతం ఈసారి వేలంలో భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది. పేసర్లు సిరాజ్, అర్షదీప్​​ సింగ్​ తోపాటు విదేశీ ప్లేయర్లు మిచెల్​ స్టార్క్, లియామ్​​ లివింగ్టన్​, ఫజల్​హక్​ ఫరూఖీ, కైల్​ మేయర్స్​, మిచెల్​ సాంట్నర్​, సికందర్​ రజా మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *