IPL Mega Auction 2025: ఐపీఎల్​చరిత్రలోనే పంత్​కు రికార్డు ధర.. ఎంతంటే?

IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో టీమిండియా వికెట్​కీపర్​రిషభ్​పంత్​కు (Rishabh Pant) రికార్డు ధర లభించింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా పంత్​ నిలిచాడు. అతడి కోసం లఖ్​నవూ, బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీ పడగా.. చివరకు లఖ్​నవూ రికార్డు ధరకు దక్కించుకుంది.

శ్రేయస్​ అయ్యర్​కు రూ.26.75 కోట్లు
ఇక ఇదే ఆక్షన్‌లో శ్రేయస్ అయ్యర్ ను (shreyas iyer) పంజాబ్​కింగ్స్​రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్లు అతడి కోసం మొదట కోల్​కతా, ఢిల్లీ ఫ్రాంచైజీలు పోటీ పడగా.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన పంజాబ్​కింగ్స్​ రూ.26.75 కోట్లు పెట్టి ఎగరేసుకుపోయింది.

రాహుల్​కు 14 కోట్లు, చాహల్​కు 18 కోట్లు
ఇక మరో కీపర్​కేఎల్​రాహుల్​ను (KL Rahul) ఢిల్లీ జట్టు రూ.14 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. రిషబ్ పంత్‌ను వదిలేసిన ఢిల్లీ.. కెప్టెన్సీ చేసే సత్తా ఉన్న ప్లేయర్ కోసం వెతికి కేఎల్​రాహుల్​కు దక్కించుకుంది. యుజ్వేంద్ర చాహల్ ను (Yuzvendra Chahal) పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.పంత్, అయ్యర్, చాహల్​కు పెట్టిన ధర చూస్తే రాహుల్​కు తక్కువ ధర పలికారని చర్చ నడుస్తోంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *