
మిడిల్ఈస్ట్(Middle East)లో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడుల(Israeli Airstrikes)కు దిగింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ (Israel) దాడులతో విరుచుకుపడటంతో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్(Revolutionary Guard Chief) సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఈమేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
BREAKING:
Israel unleashes Operation Rising Lion — targeting Iran’s nuclear core and military infrastructure.
Netanyahu warns: “We won’t stop until the threat is neutralized. The tyrants of Tehran must be stopped before it’s too late.” pic.twitter.com/J4swEIsm9t
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) June 13, 2025
ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించాం: నెతన్యాహు
కాగా ఈ ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israeli PM Benjamin Netanyahu) స్పందించారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘Operation Rising Lion’ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. మరోవైపు తమ దేశ అణు స్థావరాలపై మిస్సైళ్లతో దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Ayatollah Khamenei) హెచ్చరించారు. టెల్ అవీవ్(Tel Aviv)పై తప్పక ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Moments ago, Israel launched Operation “Rising Lion”, a targeted military operation to roll back the Iranian threat to Israel’s very survival.
This operation will continue for as many days as it takes to remove this threat.
——
Statement by Prime Minister Benjamin Netanyahu: pic.twitter.com/XgUTy90g1S
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) June 13, 2025
భారత పౌరులకు కీలక హెచ్చరికలు
ఇదిలా ఉండగా ఈ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరుల(Citizens of India)ను ఉద్దేశించి అక్కడి ఇండియన్ ఎంబసీలు (Indian Embassy) అడ్వైజరీలు జారీ చేశాయి. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా(SM)లో తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అని ప్రకటించాయి.