జానీ మాస్టర్​కు షాక్.. జాతీయ పురస్కారం తాత్కాలిక నిలిపివేత

Mana Enadu : ప్రముఖ కొరియోగ్రాఫర్​ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ (Jani Master)కు మరో షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ (National Film Award Cell) ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు
2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్​ ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీన దిల్లీలోని విజ్ఞాన్​భవన్​లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్​కు ఆహ్వానం కూడా అందింది. అయితే లైంగిక్ వేధింపులు, మైనర్ పై అత్యాచారం కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు నేషనల్​ ఫిల్మ్​ అవార్డు సెల్​ ప్రకటించింది.
అసలు ఏంటీ కేసు?
జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. 
జానీ మాస్టర్ కు బెయిల్ 
జానీ మాస్టర్​పై అత్యాచారం, లైంగిక వేధింపుల​ అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెల్ పేర్కొంది. అలాగే ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్​ కోసం జానీ మాస్టర్​ మధ్యంతర బెయిల్​ పొందిన విషయం తెలిసిందే. ఇందుకు ఆయనకు న్యాయస్థానం ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్​ను ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవార్డును వెనక్కి తీసుకోవడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *