ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. జియో తన రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ను, రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న పాపులర్ ప్లాన్ను తొలగించింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ ప్లాన్(Plan) తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందించేది. జియో ఈ నిర్ణయం వెనుక సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం, భవిష్యత్తులో IPO ఓ కోసం సన్నద్ధత ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జియో కనీస ప్లాన్ రూ.299 నుంచి మొదలవుతుంది, ఇది రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది.
ఈ రోజు నుంచి అందుబాటులో ఉండదు..
తాజాగా జియో బాటలోనే ఎయిర్టెల్(Airtel) కూడా తన రూ.249 ఎంట్రీ-లెవల్ ప్లాన్ను నిలిపివేసింది. ఈ ప్లాన్ కూడా 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల వ్యాలిడిటీతో అందించేది. ఈరోజు (ఆగస్టు 20) నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఎయిర్టెల్ ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ డేటా ఉన్న ఖరీదైన ప్లాన్ల వైపు వినియోగదారు(Users)లను నెట్టివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Jio and Airtel removed their entry level most affordable Rs 249 plans offering 1GB per day.
Duopoly…#Investor #niftycrash #OptionsTreding #Investing #BREAKING #Nifty #StockMarketUpdate pic.twitter.com/ngVc3cbUKU
— Subrata Bhowmick 🇮🇳 (@subrata_minu) August 20, 2025
ఈ మార్పులు వినియోగదారులకు ఆర్థిక భారాన్ని పెంచుతాయని, ముఖ్యంగా తక్కువ డేటా అవసరమైన వారికి ఇబ్బంది కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియో, ఎయిర్టెల్ రెండూ ఎక్కువ డేటా ప్లాన్లను ప్రోత్సహిస్తూ, బడ్జెట్(Budget) ఆప్షన్లను తొలగిస్తున్నాయి.






