కుమారుడికి క్షమాభిక్ష.. జో బైడెన్‌ నిర్ణయంపై ట్రంప్ గరం

Mana Enadu : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) తాను అధ్యక్ష పీఠం దిగబోయే ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్‌ కేసుల్లో హంటర్‌ (Joe Biden pardons son Hunter)కు క్షమాభిక్ష ప్రసాదించారు. తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవి అని జో బైడెన్‌  ఆరోపించారు.

ఇక జరిగింది చాలు

‘‘అమెరికన్లను ఓ నిజం చెప్పాలి. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే చెప్పాను. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నా కుమారుడు హంటర్‌ (Hunter Biden)ను అన్యాయంగా విచారించే సమయంలోనూ ఈ సూత్రానికి కట్టుబడే నేను ఏం చేయలేక చూస్తుండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. కానీ ఇంకా మౌనంగా ఉండలేను. ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని డిసైడ్ అయ్యాను. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను’’ అని బైడెన్ పేర్కొన్నారు. 

బైడెన్ చేసింది న్యాయ విఘాతం

మరోవైపు జో బైడెన్‌ తన కుమారుడు హంటర్‌ బైడెన్‌కు క్షమాభిక్ష పెట్టడాన్ని అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తప్పుబట్టారు. ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని అన్నారు. బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 (జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో ట్రంప్‌ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు) బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదని డొనాల్డ్ ట్రంప్ నిలదీశారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *