లైవ్ రిపోర్టింగ్ చేస్తూ వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్టు! ఈ సంఘటన ఎక్కడంటే?

జర్నలిజం( Journalisum) అంటే కేవలం వార్తలు అందించడమే కాదు…నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపనతో ఎలాంటి ప్రమాదాలకైనా సిద్ధంగా ఉండే వృత్తి జర్నలిజం. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో జర్నలిస్టులు( Journalist) తమ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి వేస్తుంటారు. యుద్ధాలు జరుగుతున్నా, ప్రకృతి విపత్తులు ఉన్నా, వైరస్‌లు విజృంభిస్తున్నా కూడా మౌనంగా కూర్చోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ బారి వర్షాలు, వరదల గురించి లైవ్ రిపోర్టింగ్(Live Reporting) చేస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌(Pakistan)లోని రావల్పిండిలో జరిగింది. మెడ వరకు నీటిలో నిలబడి, మైక్రోఫోన్‌ పట్టుకొని వార్తలు అందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఆయన అదుపుతప్పి వరదలో మునిగిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘అల్ అరేబియా ఇంగ్లీష్’ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు జర్నలిస్టు ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు అటువంటి ప్రాణహానికర పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *