Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణల అంశం తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చివరగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(Ex Cm KCR)ను ఇవాళ (జూన్ 11) కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కేసీఆర్‌కు విచారణకు ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. తొలుత ఈనెల 5వ తేదీనే విచారణకు రావాలని కమిషన్ ఆదేశించగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని దానికి బదులు 11వ తేదీన విచారణకు హాజరు అవుతానంటూ కేసీఆర్ లేఖ రాశారు. దీంతో ఆయన విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ విచారణతో అసలు విషయం తేలనుందా?

కాగా ఇవాళ ఉదయం 8 గంటలకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్(Erravalli Farm House) నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఉ.11.30 గంటలకు హైదరాబాద్ BRK భవన్‌లో కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh) ఎదుట విచారణకు హాజరవుతారు. కాగా ఇప్పటివరకు 17 మంది కీలక వ్యక్తులను విచారించిన కమిషన్ చివరగా KCRను విచారించనుంది. రాజకీయ ప్రముఖులుగా అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీశ్ రావు(Harish Rao)ను ఆర్థిక, టెక్నికల్ అంశాలపై విచారించింది. కాగా కేసీఆర్ విచారణతో అసలు విషయం బయటపడుతుందా? అసలు కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారనేది ఉత్కంఠగా మారింది.

హరీశ్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు

కాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావుతో కేసీఆర్ రెండ్రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ ఓ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint Presentation) కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ మొత్తంగా 200మందికి పైగా విచారించి ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *