Vijay Devarakonda: ‘కింగ్‌డమ్’ టీమ్ రెమ్యునరేషన్ లిస్టు వైరల్.. విజయ్ దేవరకొండ పారితోషికం స్పెషల్ హైలైట్!

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌డమ్’ (Kingdom)ఈ రోజు (జూలై 31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి( Gowtham Tinnanuri) ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తన స్టైల్‌కి భిన్నంగా,  మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ పవర్‌పుల్ యాక్షన్ మూవీని రూపొందించారు.

ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

‘కింగ్‌డమ్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన తారలు, టెక్నీషియన్ల పారితోషికాల( Remuneration ) వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ సుమారు రూ. 30 కోట్ల రెమ్యునరేషన్( Remuneration ) తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికితోడు లాభాల్లో షేర్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి – రూ. 7 కోట్లు, సత్యదేవ్ – రూ. 3 కోట్లు, అనిరుధ్ – రూ. 10 కోట్లు, భాగ్య శ్రీ బోర్సే – రూ. 1 కోటి, ఇతర నటీనటులు – రూ. 2 కోట్లు, టెక్నీషియన్లు – రూ. 7.5 కోట్లు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంటే పారితోషికాల మొత్తమే దాదాపు రూ. 60 కోట్లు కాగా, సినిమా మొత్తం బడ్జెట్ రూ. 130 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. అయితే, ఇందులో ఎంత నిజముందో తెలియాల్సిఉంది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ దేవరకొండ నటన బాగుందంటూ ఫ్యాన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *